మోదీకి హిట్లర్ కు పట్టిన గతే పడుతుంది !

Telugu Lo Computer
0


నాజీ నియంత హిట్లర్‌లా వ్యవహరిస్తున్నమోదీకి హిట్లర్ గతి పడుతుందని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత సుభోద్ కాంత్ సహాయ్ అన్నారు. అగ్నిపథ్ స్కీంపై దేశవ్యాప్తంగా హింసాత్మక నిరసనలు తలెత్తని నేపధ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సుభోద్ కాంత్ సహాయ్ వ్యాఖ్యలపై జార్ఖండ్ మాజీ సీఎం రఘబర్ దాస్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇలాంటి రాజ్యాంగ విరుద్ధ వ్యాఖ్యలు చేసే డీఎన్ఏ కాంగ్రెస్‌లో ఉందని విమర్శించారు. ప్రధాని మోదీ గతంలో గుజరాత్ సీఎంగా ఉన్న సమయంలో అసెంబ్లీ ఎన్నికల నేపధ్యంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అప్పట్లో మోదీని మృత్యు వ్యాపారిగా అభివర్ణించిందని గుర్తు చేశారు. ఈ తరహా భాషతో బాధపడిన గుజరాతీలు ఆ ఎన్నికల్లో మోదీకి మళ్లీ పట్టం కట్టారని పేర్కొన్నారు. ప్రధానిగా పలుమార్లు ప్రజలు మోదీని గద్దెనెక్కించి తమ అభిమానం చాటుకున్నారని దీంతో కాంగ్రెస్ నైరాశ్యంలో కూరుకుపోయిందని రఘుబర్‌దాస్ అన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)