ఆంధ్రప్రదేశ్ లోని శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తి పంచాయతీ కమిషనర్ మునికుమార్ (51) రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న ఘటన శనివారం కడప శివారులో చోటుచేసుకుంది. కడప నగర పాలక కార్యాలయంలో సూపరింటెండెంట్ గా ఉన్న మునికుమార్ 3 నెలల క్రితం కడప కార్పొరేషన్ నుండి పుట్టపర్తికి పంచాయతీ కమిషనర్గా బదిలీపై వచ్చారు. రెండు రోజుల క్రితం పుట్టపర్తి నుంచి కడపకు వచ్చారు. ఈరోజు ఉదయం కడప శివారులో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబ కలహాలే కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
పుట్టపర్తి ఇన్చార్జి మున్సిపల్ కమిషనర్ ఆత్మహత్య
June 25, 2022
0
Tags