జీఎస్టీ పరిహార సెస్సు మరో నాలుగేళ్లు పెంపు !

Telugu Lo Computer
0


జీఎస్టీ పరిహార సెస్సు విధింపు గడువును కేంద్రం మరో నాలుగేళ్లు పొడిగించింది. దీంతో మార్చి 31, 2026 వరకు పరిహార సెస్సు చెల్లించాల్సి ఉంటుంది. ఈ మేరకు కొత్త నిబంధనలను శనివారం కేంద్ర ఆర్థిక శాఖ నోటిఫై చేసింది. మరోవైపు ఈ నిర్ణయం వల్ల వ్యాపారాలపై భారం కొనసాగుతుందని వ్యాపార వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. నిజానికి ఈ నెల 30తో సెస్సు విధింపునకు స్వస్తి పలకాల్సి ఉంది. కానీ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అధ్యక్షతన భేటీ అయిన జీఎస్టీ మండలి మాత్రం దీన్ని మరింతకాలం వసూలు చేయాలని నిర్ణయించింది. రాష్ట్రాలకు పరిహారం చెల్లించేందుకు కేంద్రం గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో రుణాలు తీసుకుంది. దీంతో అవి తీరే వరకు సెస్సును కొనసాగించాలని తాజాగా మండలి తీర్మానించింది. రాష్ట్రాలకు పరిహారం చెల్లించడానికి కేంద్రం 2020-21లో రూ.1.1 లక్షల కోట్లు, 2021-22లో రూ.1.59 లక్షల కోట్లు అప్పుగా తీసుకుంది. గత ఆర్థిక సంవత్సరం రూ.7,500 కోట్లు వడ్డీ కింద చెల్లించింది. ఈ ఏడాది రూ.14,000 కోట్లు చెల్లించాల్సి ఉంది. 2023-24 నుంచి అసలును చెల్లించడం ప్రారంభించి మార్చి 2026 వరకు పూర్తిగా చెల్లించాల్సి ఉంటుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)