తిరుపతి లడ్డు కొనుగోళ్లపై పరిమితి !

Telugu Lo Computer
0


తిరుమల వేంకటేశుని దర్శనానికి వస్తున్న భక్తుల సంఖ్య భారీగా పెరగడంతో తితిదే లడ్డూలపై పరిమితి విధించింది. ప్రతి భక్తుడికి ఒక ఉచిత లడ్డూతో పాటు అదనంగా రెండు మాత్రమే కొనుక్కోడానికి అనుమతి ఇస్తున్నారని భక్తులు తెలిపారు. గతంలో రూ.50 చొప్పున ఎన్నయినా కొనుక్కునే వీలు ఉండేది. ప్రస్తుతం భక్తుల సంఖ్య భారీగా పెరగడంతో లడ్డూలను పరిమిత సంఖ్యలోనే కొనేందుకు అనుమతిస్తున్నారు. ప్రతిరోజు సుమారు 3 లక్షల వరకు లడ్డూలను తితిదే తయారుచేస్తోంది. భక్తుల సంఖ్య ప్రస్తుతం 90 వేలకు మించుతోంది. దీనిపై లడ్డూ ప్రసాద విక్రయ కేంద్రం అధికారులను సంప్రదించగా ఆదివారం భక్తుల సంఖ్య అధికంగా ఉండడంతో ఒక ఉచిత లడ్డూ, రెండు అదనంగా కొనేందుకు అనుమతించామని, ప్రస్తుతం రద్దీ తగ్గడంతో నాలుగింటికి అనుమతి ఇస్తున్నామని చెప్పారు.

Post a Comment

0Comments

Post a Comment (0)