ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో మంత్రి ధరమ్ పాల్ సింగ్ ఆధ్వర్యంలో 144 మంది జంటలకు సామూహిక వివాహాలు చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలో ఒక వరుడు మంచినీళ్లు తాగొస్తానని చెప్పి వెళ్లిపోయాడు. ఎంత గాలించినా అతను దొరకలేదు. దీంతో వధువు తల్లిని ఆరా తీయగా కట్నం కింద మోటార్ బైక్ కావాలని కాబోయే అల్లుడు అడిగాడని, కానీ ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఇవ్వలేకపోయామని చెప్పింది. దీంతో కోపం తెచ్చుకున్న వరుడు.. ఇలా మండపం నుంచి పారిపోయాడని ఆరోపించింది. ఇదంతా అతను పక్కా ప్లాన్ ప్రకారమే చేశాడని తల్లీకూతుళ్లు వాదిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకున్నామని, దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు తెలిపారు.