లొంగిపోయిన మవోయిస్టు సానుభూతిపరులు

Telugu Lo Computer
0


ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో మల్కన్ గిరి జిల్లాలోని నాలుగు గ్రామాలకు చెందిన మావోయిస్టు మిలీషియా సభ్యులు 180 మంది పోలీసులు ముందు లొంగిపోయారు. ఏవోబీలోని మల్కన్‌గిరి జిల్లా జోడంబో పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని జంత్రీ పంచాయతీ పరిధిలోని ధాకడ్‌పదర్, డాబుగూడ, తాబేర్, అర్లింగ్‌పడ గ్రామాలకు చెందిన మావోయిస్టు మిలీషియా సభ్యులు బీఎస్ఎఫ్ క్యాంపు కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లొంగిపోయారు. వీరంతా కాల్పుల ఘటనలు ,పౌర హత్యలు, జాతీయ జెండాను అవమానించిన కేసులు, వాహనాల దహనం కేసులు, ఎన్నికలను బహిష్కరించమని ప్రచారం మావోయిస్టులకు రవాణా సౌకర్యాలు కల్పించటం భద్రతా బలగాల కదలికలను మావోయిస్టులకు చేరవేయటం వంటి కార్యకలాపాల్లో పాల్గోన్నారు. ఇకపై మావోయిస్టు కార్యకలాపాల్లో పాల్గొనబోమని గ్రామస్తులు ప్రతిజ్ఞ చేశారు. ఏవోబీ మల్కన్‌గిరి జిల్లాలో యాంటీ నక్సల్‌ ఆపరేషన్‌ జోరుగా సాగుతోంది. జిల్లా నుంచి మావోయిస్టులను పూర్తిగా నిర్మూలించేందుకు బీఎస్ఎఫ్ జిల్లాకు వచ్చి ఆ తర్వాత మల్కన్‌గిరి జిల్లా రూపురేఖలను మార్చేసింది. క్రమంగా ఒక్కో మావోయిస్టు కోటను బీఎస్ఎఫ్ బలగాలు ఆక్రమించుకున్నాయి. కొన్ని నెలల క్రితం జిల్లాలోని చివరి మావోల స్థావరాన్ని బీఎస్ఎఫ్ బలగాలు చేజిక్కించుకోవడంతో జంత్రి పంచాయతీ వాసులు మార్పును గమనిస్తున్నారు. జూన్ 2న, పోలీసు డిజి సునీల్ బన్సల్ స్వాభిమాన్ ప్రాంతాన్ని సందర్శించినప్పుడు 50 మావోయిస్టు సానుభూతిపరులు లొంగిపోగా, తాజాగా అదే పంచాయతీలో 180 మంది మావోయిస్టు సానుభూతిపరులు లొంగిపోయారు.

Post a Comment

0Comments

Post a Comment (0)