రెండేళ్లుగా ఆడ కుక్కపై అత్యాచారం !

Telugu Lo Computer
0


మహారాష్ట్రలోని థానేలో నివసించే అరవై ఏళ్ళ వృధ్దుడు రెండేళ్లుగా ఆడ కుక్కపై లైంగిక దాడి చేస్తున్నాడు. కొందరు పిల్లలు ఆ దృశ్యాలను రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయటంతో ఈవిషయం వెలుగులోకి వచ్చింది. కొందరు జంతు ప్రేమికులు ఈవీడియోను జంతు ప్రేమికురాలు రేఖా రేడ్కర్ కు పంపటంతో ఆమె డోంబివిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఇంతలో సమాచారం తెలుసుకున్న వృధ్ధుడు అక్కడి నుంచి పరారయ్యాడు. నిందితుడిని కళ్యాణ్ ఈస్ట్ ప్రాంతంలోని పత్తిపూల్ సమీపంలోని హనుమాన్ నగర్ లో నివాసం ఉంటున్న శ్రీ సాగర్ అలియాస్ అప్పగా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం ఆ ప్రాంతంలోని పిల్లలు 3 నెలల క్రితం కూడా ఇలాంటి సంఘటనను రికార్డు చేసినట్లు తెలిపారు. నిందితుడిపై 1960 జంతు హింస చట్టంలోని ఐపీసీ 377 (11)(1)(A) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితుడికి సుమారు రూ. 50 వేల జరిమానా విధించే అవకాశం ఉన్నట్లు జిల్లా జంతు సంరక్షణాధికారి, భారత జంతు సంక్షేమ మండలి సభ్యులు మిథేష్ ఎస్ జైన్ చెప్పారు. జంతువులపై పశువాంఛ తీర్చుకునే ఉదంతాలు పెరుగుతున్నాయని వీరిని కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉందని జైన్ అన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)