సర్పంచ్ దారుణ హత్య

Telugu Lo Computer
0

 


ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో పోలీసు ఇన్ఫార్మర్ నెపంతో ఓ గ్రామ సర్పంచ్‌ను  నక్సలైట్లు దారుణంగా హత్య చేశారు. పోలీసులు  తెలిపిన వివరాల ప్రకారం.. తోయ్‌నర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మోర్మద్ గ్రామ సర్పంచ్ రాతిరామ్ కుడియం (36) అనే సర్పంచ్‌పై నక్సలైట్లు గత రాత్రి దాడి చేశారు. మొదట ఆయన ఇంట్లోకి దూసుకెళ్ళిన నక్సలైట్లు తాడుతో గొంతును బిగించి, ఊపిరి ఆడకుండా చేసి చంపారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఇవాళ ఉదయం ఆయన ఇంటికి వెళ్ళారు. ఆయన మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆ సర్పంచ్ పోలీసులకు ఇన్ఫార్మర్‌గా పనిచేస్తున్నాడన్న అనుమానంతోనే నక్సలైట్లు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ హత్యపై తదుపరి దర్యాప్తు జరుపుతున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)