తెలంగాణలో 434 కరోనా కేసులు

Telugu Lo Computer
0


తెలంగాణలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. రాష్ట్రంలో ఇవాళ 27,754 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, కొత్తగా 434 కేసులు నమోదయ్యాయి. తాజాగా కరోనా నుంచి ఈరోజు 129 మంది కోలుకున్నారు. జీహెచ్‌ఎంసీలో కొత్తగా 292 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 2,680 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ తెలిపింది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కరోనా నిబంధనలు కచ్చితంగా పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)