నదిలో భార్యతో సరస సల్లాపాలు !

Telugu Lo Computer
0


ఉత్తరప్రదేశ్, అయోధ్యలోని సరయూ నదిలో ఓ జంట అనుచితంగా ప్రవర్తించింది. నదిలో పుణ్య స్నానం ఆచరిస్తూ భార్యతో భర్త సరసం ఆడాడు. భార్యకు కిస్సులు ఇవ్వడాన్ని చూసిన జనం ఆ వ్యక్తిని చితకబాదారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అయ్యింది. నదిలో స్నానం చేస్తున్న జనం ఆ భార్యాభర్తలను నిలదీశారు. భార్య వద్ద నుంచి భర్తను లాగేసి చితక్కొట్టారు. భార్య అడ్డుకునే ప్రయత్నం చేసినా అక్కడున్న వారు ఎవరూ వినలేదు. అయోధ్యలో ఇలాంటి అశ్లీలాన్ని సహించబోమన్నారు. ఈ ఘటన పట్ల అయోధ్య పోలీసులు విచారణ చేపడుతున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)