దేశంలో 4,270 కరోనా కొత్త కేసులు

Telugu Lo Computer
0


దేశంలో 4,13,699 కరోనా నిర్థారణ పరీక్షలు చేయగా 4,270 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,31,76,817 కి చేరింది. 24 గంటల్లో కరోనా కారణంగా 15 మంది మరణించారు. దీంతో దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 5,24,692 కి చేరింది. నిన్న 2,619 మంది ఈ మహమ్మారి నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఈ మహమ్మారిని జయించిన వారి సంఖ్య 4,26,28,073కి చేరింది. ప్రస్తుతం దేశంలో 24,052 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రికవరీ రేటు 98.73 గా, రోజు వారి పాజిటివ్ రేటు 1.03గా ఉంది. దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతోంది. నిన్న11,92,427 మందికి టీకాలు వేశారు. మొత్తంగా ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,94,09,46,157 డోసులను పంపిణీ చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)