దేశంలోగడిచిన 24 గంటల్లో దేవంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరిగింది. కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన తాజా బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 13,216 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 23 మంది మృతిచెందారు. దీంతో, దేశంలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 4,32,70,577 కు చేరుకుంది. ఇక మరణించిన వారి సంఖ్య 5,24,840కి చేరింది. ప్రస్తుతం దేశంలో 68,108 యాక్టివ్ కేసులు ఉన్నాయి.పెరుగుతున్న పాజిటివ్ కేసుల కారణంగా రోజూవారీ పాజిటివిటీ రేటు 2.73 శాతానికి పెరిగింది. 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 8,148 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇక దేశ వ్యాప్తంగా రికవరీల సంఖ్య 4,26,90, 845కు చేరుకుంది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,96, 00,42,768 మందికి కరోనా వ్యాక్సిన్లను అందించినట్టు కేంద్రం తెలిపింది.
దేశంలో 13,216 కొత్త కరోనా కేసులు నమోదు
June 18, 2022
0