కోడలికి మళ్లీ పెళ్లి చేసిన అత్తమామలు !

Telugu Lo Computer
0


మధ్యప్రదేశ్‌ లోని థార్ జిల్లాకు చెందిన రిటైర్డ్ బ్యాంకు మేనేజర్ యుగ్ ప్రకాశ్ తివారీ కి భార్య, కుమారుడు ప్రియాంక్ తివారీ ఉన్నారు. ప్రియాంక్ తివారీకి భార్య రీచా, కూతురు అనన్య తివారీ (9) ఉన్నారు. కరోనాతో ప్రియాంక్ తివారీ గతేడాది చనిపోయాడు. అప్పట్నుంచి ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. రీచా తన భర్త గురించే ఆలోచిస్తూ మానసికంగా కుంగిపోతుండటాన్ని యుగ్ ప్రకాశ్ గమనించాడు. యుగ్ ప్రకాశ్ దంపతులు కోడలు రీచాను కూతురిలా భావించారు. ఆమె కొత్త జీవితాన్ని ప్రసాదించాలని నిర్ణయించారు. దీంతో రీచాకు మరో పెళ్లి చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో నాగ్‌పూర్‌కు చెందిన వరుణ్ మిశ్రాతో రీచాకు దగ్గరుండి అంగరంగ వైభవంగా పెళ్లి చేశారు. నాగ్‌పూర్‌లో ప్రియాంక్ తివారీ కొనుగోలు చేసిన ఓ భవనాన్నిరీచాకు బహుమతిగా ఇచ్చారు. రీచా భవిష్యత్‌లో ఉన్నతంగా బతకాలనే ఉద్దేశంతోనే ఆ భవనం రాసిచ్చామని యుగ్ ప్రకాశ్ దంపతులు తెలిపారు. వివాహం అనంతరం వరుణ్ మిశ్రాతో కలిసి రీచా, కూతురు అనన్య నాగ్‌పూర్ వెళ్లిపోయారు. కోడలికి మరో పెళ్లి చేసిన యుగ్ ప్రకాశ్ దంపతులపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.


Post a Comment

0Comments

Post a Comment (0)