పంజాబ్ లోని పాటియాలా లా యూనివర్శిటిలో 60 మంది విద్యార్థులకు వైరస్ పాజిటివ్గా తేలింది. దీంతో అధికారులు ఆ యూనివర్సిటీని కంటైన్మెంట్ జోన్గా ప్రకటించారు. బాధితుల్లో స్వల్ప లక్షణాలు కనిపిస్తున్నాయని వెల్లడించారు. వారిని ప్రత్యేక గదుల్లో ఐసోలేషన్లో ఉంచారు. కోవిడ్ వ్యాప్తి అరికట్టటానికి మే 10కల్లా విద్యార్ధులు వర్శిటీ ఖాళీ చేయాలని అధికారులు ఆదేశించారు. మరోపక్క ఐఐటీ మద్రాస్లో ఇటీవల పదుల సంఖ్యలో విద్యార్థులకు కరోనా సోకింది. ప్రస్తుతం అక్కడ వైరస్ సోకిన వారి సంఖ్య 170కి చేరింది.
పాటియాలా లా యూనివర్సిటీలో కరోనా కలకలం
May 05, 2022
0