మహారాష్ట్రలో జరుగుతున్న లౌడ్ స్పీకర్ల వ్యవహారంపై ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ స్పందించారు. జరుగుతున్న వ్యవహారం తప్పుడు వ్యవహారం అంటూ మండిపడ్డారు. జరుగుతున్న తంతు చాలా పెద్ద తప్పని, దేశాన్ని ముక్కలు చేయడానికి ఇలా చేస్తున్నారని ఫైర్ అయ్యారు. హనుమాన్ చాలీసా చదవాలనుకునే వారు రామ మందిరాలకు వెళ్లి చదువుకోవాలని, మసీదు దగ్గరికి వెళ్లాల్సిన అవసరం ఏం వచ్చిందని ప్రశ్నించారు. ఇలా చేయడం అంటే ప్రజలను చికాకు పెట్టడమేనని అన్నారు. ఈ చికాకు ద్వారానే అల్లర్లు రేగుతాయని లాలూ వివరించారు.
చాలా పెద్ద తప్పు
May 05, 2022
0
Tags