మహిళా న్యాయవాదిని తన్నిన వ్యక్తి

Telugu Lo Computer
0


కర్ణాటకలోని బాగల్‌కోట్ జిల్లాలోని వినాయక్ నగర్‌లో అందరూ చూస్తుండగానే ఓ వ్యక్తి నడిరోడ్డుపై మహిళా న్యాయవాదిని తన్నాడు. బాగల్‌కోట్‌కు చెందిన మహంతేష్ అనే వ్యక్తి స్థానికంగా ఉన్న యూనివర్సిటీలో ఫోటోగ్రాఫర్‌గా పని చేస్తున్నాడు. మహంతేష్ ఇంటి పక్కనే సంగీత అనే లాయర్ కూడా నివసిస్తోంది. అయితే వీరిద్దరి మధ్య గత కొంతకాలం నుంచి వివాదాలు నడుస్తున్నాయి. ఓ సివిల్ కేసులో మహంతేష్‌ను సంగీత ఇబ్బందులకు గురి చేసింది. అదును కోసం ఎదురు చూసిన మహంతేష్ సంగీతపై నడిరోడ్డుపై దాడి చేశాడు. ఆమె చెంపలపై కొడుతూ.. కడుపుపై బలంగా తన్నాడు. అతని నుండి  తప్పించుకునేందుకు అక్కడున్న కుర్చీని అడ్డు పెట్టుకునేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. ఈ వీడియో వైరల్ అయ్యింది. మహంతేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)