గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్లో మెక్డొనాల్డ్స్ అవుట్లెట్లో కూల్డ్రింక్ తాగేందుకు వచ్చిన ఓ వినియోగదారుడికి చేదు అనుభవం ఎదురైంది. అతడి కూల్డ్రింగ్ గ్లాసులో బల్లి కనిపించడంతో షాక్కు గురయ్యాడు. వెంటనే ఫొటో తీసి సోషల్మీడియాలో పెట్టగా, అది వైరల్గా మారింది. కూల్ డ్రింక్లో బల్లి ఉన్న చిత్రాన్నివినియోగదారుడు భార్గవ్ జోషి సోషల్మీడియాలో షేర్చేశాడు. ఈ ఫొటో వైరల్ అయ్యింది. అలాగే, ఈ విషయాన్ని అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ దృష్టికి తీసుకెళ్లాడు.ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ దేవాంగ్ పటేల్ ఆధ్వర్యంలో అధికారులు మెక్డోనాల్డ్స్ రెస్టారెంట్లో నమూనాలు సేకరించి, అహ్మదాబాద్లోని పబ్లిక్ హెల్త్ లాబొరేటరీలో పరీక్ష కోసం పంపించారు. ఈ పరీక్షా ఫలితాలు వచ్చేవరకు రెస్టారెంట్ను మూసివేయాలని ఆదేశించారు.
కూల్డ్రింక్లో బల్లి..!
May 23, 2022
0
Tags