ఢిల్లీలో కొంతమంది దుండగులు రెచ్చిపోయారు. సుభాష్ నగర్ ప్రాంతంలో అందరూ చూస్తుండగానే నడిరోడ్డుపై కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. రోడ్లు రద్దీగా ఉన్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు కారుపై కాల్పులకు దిగారు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయారు. దాదాపు పది రౌండ్లు కాల్పులు జరిపారు. గాయపడినవారిని అజయ్ చౌదరి, జస్సా చౌదరిగా గుర్తించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కాల్పులకు పాల్పడిన వారి కోసం గాలింపు మొదలుపెట్టారు. సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నామని డీసీపీ ఘనశ్యామ్ బన్సాల్ తెలిపారు.
ఢిల్లీలో నడి రోడ్డుపై కాల్పులు !
May 08, 2022
0
Tags