దళితుడని గుర్రంపై నుంచి దించేశారు !

Telugu Lo Computer
0


ఉత్తరాఖండ్‌ అల్మోరాలో పెళ్లైన సందర్భంగా వరుడిని బంధు మిత్రుల ఘనంగా గుర్రంపై ఊరేగిస్తున్నారు. కానీ అతడు దళితుడని, గుర్రంపై ఊరేగడమేంటంటూ గ్రామస్తులంతా కలిసి అతడిని కిందకు దించేశారు. ఈ ఘటనపై వరుడి తండ్రి ఎస్‌డీఎమ్‌కు ఫిర్యాదు చేశాడు. తన కొడుకు గుర్రం నుంచి కిందకు దిగకుంటే చంపేస్తామని గ్రామస్తులు తమను బెదిరించారని తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. అయితే ఈ విషయం దర్యాప్తు చేయాలని జిల్లా పాలన శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.

Post a Comment

0Comments

Post a Comment (0)