తన పెంపుడు కుక్కతో వాకింగ్కు వెళ్లేందుకు ఢిల్లీలోని త్యాగరాజ్ స్టేడియాన్ని ఖాళీ చేయించిన ఐఎఎస్ అధికారిని ప్రభుత్వం బదిలీ చేసింది. తర్ఫీదు పొందుతున్న క్రీడాకారులను బయటికి వెళ్లగొట్టి వాకింగ్ కోసం స్టేడియాన్ని వినియోగించడం దేశవ్యాప్తంగా వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. 1994 బ్యాచ్కి చెందిన ఐఎస్ అధికారి సంజీవ్ ఖిర్వార్ను లఢఖ్కు బదిలీచేయగా, ఆయన భార్యను అరుణాచల్ ప్రదేశ్కు బదిలీ చేశారు. సంజీవ్ ఖేర్వార్ ఢిల్లీ ప్రధాన కార్యదర్శిగా (రెవెన్యూ) పనిచేశారు. ఈ ఘటనపై హోంమంత్రి నివేదిక కోరినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. గురువారం సాయంత్రం హోంశాఖకు ఢిల్లీ ప్రధాన కార్యదర్శి నివేదికను సమర్పించడంతో వారిని బదలీ చేయాల్సిందిగా సంబంధిత మంత్రిత్వ శాఖను ఆదేశించింది.
వాకింగ్ కోసం స్టేడియాన్ని ఖాళీ చేయించిన అధికారి బదిలీ
May 27, 2022
0
Tags