మధ్యప్రదేశ్లోని ఉజ్జయినీలో అస్లానా అనే ప్రాంతానికి చెందిన రమేశ్లాల్ అనే వ్యక్తికి నికిత, కరిష్మ అనే ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. తాజాగా వారిద్దరికీ ఒకే రోజు పెళ్లి చేశారు. కాగా, వరుళ్లు ఇద్దరు వేరు వేరు కుటుంబాలకు చెందినవారు. మూడు కుటుంబాలు ఒక చోట చేరి వీరి పెళ్లిని అంగరంగ వైభవంగా నిర్వహించారు. అయితే పెళ్లి ముగుస్తున్న సమయంలో కరెంట్ పోయింది. ముహూర్తం ప్రకారం తంతు నిర్వహించాలని, చీకట్లోనే మిగిలిన పెళ్లి కార్యక్రమం నిర్వహించి అప్పగింతలు కూడా చేశారు. అయితే తీరా ఇంటికెళ్లాక చూస్తే వధూవరులు మారిపోయారు. జరిగిన పొరపాటును గుర్తించి అనంతరం సరి చేసుకున్నారు.
పెళ్లిపందిట్లో మారిపోయిన వధువులు
May 10, 2022
0
Tags