రానున్నఐదు రోజులలో భారీ వర్షాలు

Telugu Lo Computer
0


రానున్నఐదు రోజులలో పలు రాష్ర్టాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) హెచ్చరిక జారీ చేసింది. వర్షాల తీవ్రత సోమవారం గరిష్ఠ స్థాయికి చేరుకునే అవకాశం ఉందని తెలిపింది. ఏపీ, తమిళనాడు, తెలంగాణ, బిహార్‌, జార్ఖండ్‌, పశ్చిమబెంగాల్‌, ఒడిసాల్లో వచ్చే ఐదు రోజులు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు, అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. కాగా, శనివారం సంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్‌, నారాయణపేట, మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిశాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వివరించింది. తెలంగాణ మీదుగా దక్షిణ కర్ణాటక వరకు ఉన్న ఉపరితల ఆవర్తనం శనివారం బలహీనపడిందని తెలిపింది.


Post a Comment

0Comments

Post a Comment (0)