బీర్ల లోడు లారీ బోల్తా

Telugu Lo Computer
0


శ్రీకాకుళం జిల్లా నుంచి చిత్తూరు జిల్లా మదనపల్లె కు వెళ్తుండగా ప్రకాశం జిల్లాలోని సింగరాయకొండ మండలంలో బీర్ల లోడు లారీ బోల్తా పడింది. దీంతో పెద్ద ఎత్తున బీర్ బాటిల్స్ రోడ్డుపై పడిపోయాయి. విషయం తెలుసుకున్న స్థానికులు అక్కడికి పెద్ద ఎత్తున చేరుకున్నారు. రోడ్డు పై పడిన బీరు సీసాల కోసం ఎగబడ్డారు. బీరు బాటిల్స్ కు జనాలు ఎగబడటంతో అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ట్రాఫిక్ ని క్లియర్ చేశారు. రోడ్డుపై పడిపోయిన బీర్ బాటిల్స్ ను జెసిబి సాయంతో పక్కన ఉన్న కాలువలోకి నెట్టారు. అయినా కూడా కొందరు మందుబాబులు కాలువలోకి దిగి మరీ పగలకుండా ఉన్న బీర్ బాటిల్స్ సేకరించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)