కాల్పుల్లో టీవీ నటి మృతి

Telugu Lo Computer
0


జమ్మూకాశ్మీర్‌లోని బూద్గామ్‌ జిల్లాలో సామాన్య పౌరుల ఇళ్లను టార్గెట్‌ చేసి కాల్పులకు తెగబడ్డారు. ఇంట్లో ఉన్న టీవీ నటి అమ్రీన్‌ భట్‌పై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. తీవ్ర గాయాలైన ఆమెను ఆస్పత్రికి తరలించగా అప్పటికే పరిస్థితి విషమించడంతో మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనలో ఆమె పదేళ్ల మేనల్లుడు ఫర్హాన్‌ జుబీర్‌కు కూడా బుల్లెట్‌ గాయమైనట్టు పోలీసులు వెల్లడించారు. బాలుడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు తెలిపారు. నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు చెందిన ముగ్గురు ఉగ్రవాదులే ఈ దాడులు జరిపినట్టు పోలీసులు వెల్లడించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు, బలగాలు ఆ ప్రాంతంలో గాలింపు చర్చలు చేపట్టినట్టు తెలిపారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)