లాలూ, మీసా భారతి ఇండ్లలో సీబీఐ సోదాలు

Telugu Lo Computer
0


బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన కుమార్తె మీసా భారతి ఇండ్ల లో సీబీఐ దాడులు చేస్తోంది. రిక్రూట్ మెంట్ స్కామ్ కు సంబంధించి నమోదైన కేసులో సీబీఐ దాడులు నిర్వహిస్తోంది. ఢిల్లీ, పాట్నా, గోపాల్ గంజ్ సహా మొత్తం 17 ప్రాంతాల్లో సీబీఐ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి కొంతమంది నుంచి భూములు ఇండ్లు తీసుకున్నట్లు లాలూ కుటుంబంపై ఆరోపణలు ఉన్నాయి. విచారణలోనూ ఆధారాలు లభించటం తో సీబీఐ కేసులు నమోదు చేసింది.


Post a Comment

0Comments

Post a Comment (0)