బెంగళూరు నగరంలోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి శుక్రవారం బాంబు బెదిరింపులు రావడంతో భద్రతను పెంచారు. బెంగళూరు విమానాశ్రయంలో అదనపు సాయుధ పోలీసు బలగాలను మోహరించారు.శుక్రవారం ఉదయం బెంగళూరు విమానాశ్రయం కంట్రోల్ రూంకు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది.''శుక్రవారం తెల్లవారుజామున కంట్రోల్ రూమ్కి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. మరిన్ని వివరాలు తర్వాత పంచుకుంటాం'' అని బెంగళూరు పోలీసులు తెలిపారు.బెదిరింపు కాల్తో విమానాశ్రయంలో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, డాగ్ స్క్వాడ్ సోదాలు నిర్వహించాయి.విమానాశ్రయంలో పోలీసులు అలర్ట్ ప్రకటించారు.
బెంగళూరు ఎయిర్ పోర్టుకు బాంబు బెదిరింపు
May 20, 2022
0