19 కిలోల ఎల్పీజీ కమర్షియల్ సిలిండర్ పై రూ.104 పెందాయి. దీంతో హైదరాబాద్ లో కమర్షియల్ సిలిండర్ ధర రూ.2563కు పెరిగింది. యితే 14 కిలోల ఎల్ పీజీ సిలిండర్ ధరను మాత్రం పెంచలేదు. ఇది కొంత ఊరటనిచ్చే అంశం. విశాఖలో రూ.2413, విజయవాడలో రూ.2501 కు చేరాయి. ఢిల్లీలో రూ.2355కు చేరింది. ప్రస్తుతం హైదరాబాద్ లో డొమెస్టెక్ గ్యాస్ సిలిండర్ ధర రూ.1002 గా ఉంది. ప్రతి నెల 1వ తేదీన దేశవ్యాప్తంగా ఎల్ పీజీ గ్యాస్ సిలిండర్ల ధరలను ఆయిల్ కంపెనీలు సవరిస్తుండగా తాజాగా పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. ఇప్పటికే నిత్యవసర వస్తువులు, పెట్రో ధరల పెంపు ప్రజలు సతమతమవుతున్నారు. ఇప్పుడు గ్యాస్ సిలిండర్ ధరలు పెరగడంతో ప్రజలపై మరింత భారం పడనుంది.
భారీగా పెరిగిన కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర
May 01, 2022
0
Tags