ముంబయి నుంచి బెంగళూరు పయనమైన ఎయిరిండియా A320NEO విమానం గాల్లో ఉండగానే ఓ ఇంజిన్ పనిచేయడం ఆగిపోవడంతో అత్యవసరంగా మళ్లీ ముంబయి ఎయిర్పోర్టులో దిగింది. టేకాఫ్ అయిన 27 నిమిషాలకే విమాన ఇంజిన్ ఆగిపోయింది. కాగా ప్రయాణికులందరూ క్షేమంగా ఉన్నారని, ల్యాండ్ అయిన తర్వాత మరో విమానంలో వారిని తరలించినట్లు సంస్థ ప్రతినిధి వెల్లడించారు. ఎయిరిండియాకు చెందిన A320NEO విమానాలు సీఎఫ్ఎమ్ లీప్ ఇంజిన్లు కలిగి ఉంటాయి. ఆ పీల్ ఇంజిన్లలో తలెత్తిన సాంకేతిక సమస్య వల్లే ఈ ఘటన జరిగిందని అధికారులు తెలిపారు. కాగా ఈ ఘటనపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ విచారణ జరుపుతోందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
ఎయిరిండియా విమానానికి తప్పిన పెను ముప్పు
May 20, 2022
0
Tags