మే 25 నుంచి రోహిణి కార్తె ప్రవేశిస్తోంది. రోహిణి కార్తెలో ఎండలు మరింత ముదరనున్నాయి. వచ్చే నెల జూన్ 8 వరకు రోహిణి కార్తె ఉండనుంది. ఈ సమయంలో భానుడి ఉగ్రరూపం చూడాల్సి వస్తుందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు తీవ్రంగా ఉంటున్నాయి. ముఖ్యంగా వడగాల్పుల ప్రభావం అధికంగా ఉంటోంది. అన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్నాయి. ఉదయం 9 గంటలు దాటిందంటే చాలు జనం బయటకు రావాలంటే భయపడుతున్నారు. రానున్న వారం రోజుల్లో 45 డిగ్రీల సెల్సియస్ కంటే అధికంగా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. నెలాఖరు వరకు ఎండల తీవ్రత ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. మే 28 వరకు వడగాల్పుల ప్రభావం కొనసాగే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరించారు. రోహిణికార్తె ఎండలతో జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ప్రత్యేకించి మధ్యాహ్నం సమయంలో బయటికి రావొద్దని వాతావరణశాఖ అధికారులు సూచిస్తున్నారు.
రేపటి నుండి రోహిణి కార్తె !
May 24, 2022
0
Tags