రైల్వే ట్రాక్‌లు పేల్చేందుకు ఐఎస్‌ఐ కుట్ర ?

Telugu Lo Computer
0


దేశవ్యాప్తంగా రైల్వే ట్రాక్‌లను లక్ష్యంగా చేసుకుని బాంబు పేలుళ్లకు పాల్పడేందుకు పాకిస్థాన్‌ ఐఎస్‌ఐ పథకం రచించినట్లు నిఘా సంస్థలు హెచ్చరించాయి. పంజాబ్‌ సహా దాని పొరుగు రాష్ట్రాల్లో రైల్వే ట్రాక్‌లను పేల్చేందుకు ఐఎస్‌ఐ ముఠా సభ్యులు ప్లాన్‌ చేసినట్లు నిఘా వర్గాలు పేర్కొన్నాయి. సరకు రవాణా రైళ్లను లక్ష్యంగా చేసుకుని ఈ పేలుళ్లు జరపాలని కుట్ర పన్నినట్లు వెల్లడించాయి. రైల్వే ట్రాక్‌లపై దాడులు చేపట్టేందుకు ఐఎస్‌ఐ తమ మద్దతుదారులకు నిధులు కూడా పంపుతున్నట్లు నిఘా వర్గాలు తెలిపాయి. ఇలాంటి ఉగ్ర కార్యకలాపాల కోసం భారత్‌లోని పాక్‌ స్లీపర్‌ సెల్స్‌కు భారీ మొత్తంలో నగదు ఆఫర్‌ చేస్తున్నట్లు హెచ్చరించాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)