క్వాడ్ దేశాల హెచ్చరిక !

Telugu Lo Computer
0


జపాన్ రాజధాని టోక్యోలో జరిగిన క్వాడ్ సదస్సులో ప్రధాని నరేంద్ర మోడీ, అమెరికా ప్రెసిడెంట్ బైడెన్, జపాన్ ప్రధాని ఫ్యుమియో కిషిడా, ఆస్ట్రేలియా కొత్త ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్ పాల్గొన్న క్వాడ్ సదస్సులో ఇండో-పసిఫిక్ ప్రాంతంలో దూకుడును తగ్గించుకోవాలని, రెచ్చగొట్టే, ఉద్రిక్తతలు పెంచే చర్యలకు పాల్పడినా, ఏకపక్షంగా ప్రస్తుతం ఉన్న స్థితిని మార్చాలని చూసినా ఒప్పుకోబోమని చైనాని హెచ్చరించారు. ఏ వివాదాన్ని అయినా శాంతియుతంగానే పరిష్కరించుకోవాలని, బెదిరింపులు, బలప్రయోగాలకు పాల్పడరాదని స్పష్టం చేశారు. వివాదాస్పద ప్రాంతాల్లో మిలిటరీని దింపడం, సముద్ర జలాల్లో కోస్ట్ గార్డ్ నౌకలతో ఇతర దేశాలకు ఆటంకం కలిగించడం వంటి చర్యలకు దిగరాదని పేర్కొన్నారు. ఇండో-పసిఫిక్ లో టెర్రరిస్ట్ గ్రూపులపై కలిసికట్టుగా చర్యలు తీసుకుంటామని క్వాడ్ దేశాల నేతలు ప్రకటించారు. 26/11 ముంబై, పఠాన్ కోట్, తదితర టెర్రర్ అటాక్స్ ను తీవ్రంగా ఖండించారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానం 1267 (1999) ప్రకారం.. గుర్తించిన టెర్రిస్టులు, టెర్రరిస్ట్ సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. టెర్రరిజం ఏ రకంగానూ సమర్థనీయం కాదన్నారు. అఫ్గాన్ భూభాగాన్ని మళ్లీ ఎప్పటికీ ఇతర దేశాలపై దాడులకు ఉపయోగించుకోకుండా చూస్తామని, అక్కడి నుంచి టెర్రరిస్ట్ సంస్థలకు నిధులు అందకుండా అడ్డుకుంటామని స్పష్టంచేశారు. ఉక్రెయిన్ పై రష్యా అధ్యక్షుడు పుతిన్ చేపట్టిన యుద్ధం వల్ల ప్రపంచానికి ఆహార సంక్షోభం ముప్పు పెరుగుతోందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆందోళన వ్యక్తం చేశారు. యుద్ధం పేరుతో ఉక్రెయిన్ కల్చర్ ను పుతిన్ నాశనం చేస్తున్నారని, అక్కడ పంటలు పండే పరిస్థితిని లేకుండా చేయడంతో ఎగుమతులు ఆగిపోయి ఆహార సంక్షోభానికి కారణం అవుతున్నారని మండిపడ్డారు. ఇది యూరప్​కు మాత్రమే చెందిన సమస్య కాదని, గ్లోబల్​ఇష్యూ అని అన్నారు. రష్యా ఎంత కాలం యుద్ధాన్ని కొనసాగిస్తే.. అంతకాలం పాటు మిత్రపక్షాలకు అండగా నిలుస్తామని స్పష్టంచేశారు. క్వాడ్​అనేది ఒక మోజుతో పెట్టిన తాత్కాలిక కూటమి కాదని, ఇండో- పసిఫిక్ రీజియన్ లో అత్యంత శక్తిమంతమైన అలయెన్స్ అని వెల్లడించారు. క్వాడ్ భావితరాల సంక్షేమం, అభివృద్ధి కోసమే ఏర్పడిందన్నారు. సదస్సు సందర్భంగా ముందుగా ప్రధాని మోడీకి బైడెన్ ఆహ్వానం పలికారు. మోడీని మరోసారి నేరుగా కలవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)