త్రిపురలో బీజేపీ ముఖ్యమంత్రి బిప్లవ్దేవ్ శనివారం పదవికి రాజీనామా చేశారు. బీజేపీ హై కమాండ్ ఆదేశాలతో బిప్లవ్దేవ్ రాజీనామా చేశారు. ఈరోజు మధ్యాహ్నం బిప్లవ్దేవ్ గవర్నర్ సత్యదియో నారాయిన్ ఆర్య కలిసి తన రాజీనామా లేఖను అందజేశారు. బిప్లవ్దేవ్ శుక్రవారం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షాను కలిసిన తర్వాత రోజే రాజీనామా చేయడం విశేషం. శనివారం సాయంత్రమే కొత్త ముఖ్యమంత్రిని అధిష్టానం నియమించనున్నట్టు సమాచారం. వచ్చే ఏడాదే త్రిపురలో అసెంబ్లీ జరుగనున్న నేపథ్యంలో అనూహ్యంగా ఇలా సీఎం మార్పు ప్రాధాన్యతను సంతరించుకుంది.
త్రిపుర ముఖ్యమంత్రి బిప్లవ్దేవ్ రాజీనామా
May 14, 2022
0
Tags