దేశంలో కొత్తగా 2,628 కరోనా కేసులు నమోదు !

Telugu Lo Computer
0


దేశవ్యాప్తంగా 4.52 లక్షల మందికి కొవిడ్ పరీక్షలను వైద్య సిబ్బంది నిర్వహించగా  2,628 మంది కొవిడ్ పాజిటివ్ గా తేలింది. బుధవారం కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించిన కేసుల సంఖ్య కంటే గురువారం 24శాతం మేర అధికంగా కేసులొచ్చాయి. కరోనా వైరస్ తో చికిత్స పొందుతూ బుధవారం ఒక్కరోజు 2,167 మంది కోలుకున్నారు. కొత్త కేసుల పెరుగుదలతో క్రియాశీల కేసులు 15,414కు ఎగబాకాయి. ప్రస్తుతం క్రియాశీల రేటు 0.04 శాతానికి చేరగా.. రికవరీ రేటు 98.75శాతంగా ఉంది. గడిచిన 24గవంటల వ్యవధిలో కొవిడ్ బారిన పడి చికిత్స పొందుతూ 18 మంది మరణించారు. దీంతో ఇప్పటి వరకు దేశంలో కొవిడ్ తో మరణించిన వారి సంఖ్య 5.24 లక్షలకు చేరింది. కొవిడ్ నివారణకు దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ పంపిణీ జరుగుతుంది. ఇప్పటి వరకు 192 కోట్లకుపైగా డోసులు పంపిణీ అయ్యాయి. బుధవారం ఒక్కరోజు 13.13లక్షల మంది టీకా వేయించుకున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.


Post a Comment

0Comments

Post a Comment (0)