స్పైస్ జెట్ విమానానికి పెను ప్రమాదం తప్పింది. ముంబై నుంచి వెస్ట్ బెంగాల్లోని దుర్గాపూర్కు సోమవారం బయలుదేరిన స్పైస్ జెట్ విమానం బోయింగ్ బి737లో జరిగింది. ఈ విమానం దుర్గాపూర్ ఎయిర్పోర్టుకు చేరుకునే ముందు ఒక్కసారిగా కుదుపులకు లోనైంది. ఈ కుదుపుల కారణంగా లగేజీ క్యాబిన్ తలుపులు కూడా తెరుచుకుని, అందులోని లగేజి ప్రయాణికులపై పడింది. వాతావరణం సరిగా లేకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం. ఈ హఠాత్ పరిణామంతో ప్రయాణికులందరూ తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్టు స్పైస్ జెట్ సంస్థ తెలిపింది.
విమానం కుదుపులకు 17 మందికి గాయాలు
May 02, 2022
0
Tags