రెండు రోజులపాటు సర్వదర్శనం టోకెన్లు నిలిపివేత !

Telugu Lo Computer
0


రెండేళ్ల తర్వాత శ్రీవెంకటేశ్వర స్వామి సర్వదర్శనం పునరుద్ధరించడంతో క్రమంగా స్వామి వారిని దర్శించుకునేవారి సంఖ్య పెరిగింది. శని, ఆదివారాలు సెలవు రోజులు కావడంతో శ్రీవారి క్షేత్రంలో భక్తుల రద్దీ నెలకొంది. సర్వదర్శన టోకెన్ల కోసం భక్తులు పోటెత్తారు. ఈ నేపథ్యంలో శనివారం తిరుపతిలోని కౌంటర్లలో సర్వ దర్శనం టోకెన్లు పొందిన భక్తులకు ఏప్రిల్ 12వ తేదీ మంగళవారం నాటికి దర్శన స్లాట్ లభిస్తోంది. భక్తుల తాకిడి పెరుగడంతో ఆయా కేంద్రాల్లో రెండు రోజుల పాటు టోకెన్ల జారీని నిలిపివేసింది. మంగళవారం నాటి స్లాట్ పూర్తి కాగానే టోకెన్ల జారీ నిలిపివేసింది. రద్దీ కారణంగా శ్రీవారి దర్శనం వెయిటింగ్‌ సమయం పెరుగుతుండడంతో టోకెన్ల జారీని తాత్కాలికంగా టీటీడీ నిలిపివేసింది. ఆది, సోమవారాలకు సంబంధించిన సర్వదర్శనం టోకెన్ల జారీని నిలిపివేసింది. బుధవారం నాటి సర్వదర్శనం టోకెన్లను మళ్లీ 12వ తేదీ మధ్యాహ్నం నుంచి భక్తులకు తిరిగి టోకెన్లు జారీ చేయనున్నది. తిరుమలకు పయనమయ్యే శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించి తదనుగుణంగా తమ తిరుమల యాత్ర ప్రణాళిక రూపొందించుకోలరని టీటీడీ విజ్ఞప్తి చేసింది.

Post a Comment

0Comments

Post a Comment (0)