ఢిల్లీ హింస కేసు నిందితుడు కోర్టు లోపలికి వెళ్తూ 'తగ్గేది లే' అంటూ ఫోజ్ !

Telugu Lo Computer
0


ఢిల్లీ లోని జహంగీర్‌పురిలో జరిగిన హనుమాన్ జయంతి ఊరేగింపులో హింసకు సంబంధించిన కేసులో అరెస్టయిన ప్రధాన నిందితుడు అన్సార్ ప్రజంట్ పోలీసుల అదుపులో ఉన్నాడు. ఇతడిని కోర్టుకి తీసుకువెళ్తుండగా తెలుగు సూపర్ హిట్ మూవీ పుష్ప: ది రైజ్‌లోని సిగ్నేచర్ మూమెంట్ అనుసరించి మీడియా దృష్టిని ఆకర్షించాడు. మూవీలోని అల్లు అర్జున్ 'ఝుకేగా నహీ' సిగ్నేచర్ మూమెంట్ ఫాలో అవుతూ గడ్డాన్ని దువ్వుతూ మీడియా కెమెరాలకు ఫోజ్ ఇచ్చాడు. పోలీసులు అతన్ని కోర్టు లోపలికి తీసుకువెళుతున్నప్పుడు నవ్వుతూ కనిపించాడు. ప్రజంట్ ఈ వీడియో నెట్టింట తెగ ట్రెండ్ అవుతుంది. అన్సార్‌పై గతంలో రెండు దాడి కేసుల్లో ప్రమేయం ఉందని, ప్రివెంటివ్ సెక్షన్ల కింద చాలాసార్లు అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. గ్యాబ్లింగ్, ఆయుధ చట్టం కింద ఐదుసార్లు కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)