మధ్యప్రదేశ్‌ ప్రభుత్వానికి అసదుద్దీన్‌ సవాల్‌

Telugu Lo Computer
0


హైదరాబాద్‌లోని దారుస్సలాంలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ విలేకరులతో మాట్లాడుతూ, మధ్యప్రదేశ్‌ ప్రభుత్వానికి దమ్ముంటే విదేశాలకు మాంసం ఎగుమతులను నిషేధించాలని ఆయన డిమాండ్‌ చేశారు. రోజుకు వంద నుంచి రెండు వందల రూపాయలు సంపాదించే వారి వ్యాపారాలను మూసివేయ డం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. మధ్యప్రదేశ్‌లోని శివరాజ్‌ సింగ్‌ ప్రభుత్వం బుల్‌డోజర్లతో ముస్లింల ఇళ్లు, దుకాణాలు కూల్చివేసి, తగులబెట్టడంపై ఒవైసీ మండిపడ్డారు. ప్రభుత్వం ఏ చట్టం ప్రకారం కూల్చివేతకు పాల్పడిందని ఆయన ప్రశ్నించారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)