హిజ్రాల జ్యూస్‌ షాపు !

Telugu Lo Computer
0


తమిళనాడు లోని  అప్సరా రెడ్డి డిగ్నిటీ ఫౌండేషన్‌ హిజ్రాలు ఆత్మగౌరవం, ఆర్థిక స్వావలంబనతో జీవించాలనే ఆశయంతో పనిచేస్తోంది. ఈ ఫౌండేషన్‌ ద్వారా మాధురి, మయూరి అనే ఇద్దరు హిజ్రాల కోసం ఏర్పాటు చేసిన జ్యూస్‌ షాపును నటుడు గణేష్‌ వెంకట్రామన్‌తో కలిసి నటి అప్సరా రెడ్డి మంగళవారం ప్రారంభించారు. ఛెన్నై లోని అడయార్‌, ఇందిరా నగర్‌లో ఏర్పాటు చేసిన జూస్‌ షాప్‌ ప్రారంభోత్సవంలో స్థానిక పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంస్థ నిర్వాహకురాలు అప్సరా రెడ్డి మాట్లాడుతూ.. 'ట్రాన్స్‌జెండర్లు ఆత్మగౌరవంతో జీవించే హక్కు పొందాలన్న సదుద్దేశ్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. ఇప్పటికే 35 మంది హిజ్రాలకు తోపుడు బండ్లతోపాటు కుట్టు మిషన్లను కూడా పంపిణీ చేసినట్టు ఆమె వివరించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)