బైక్ పై రొమాన్స్ చేసిన ప్రియుడు అరెస్ట్

Telugu Lo Computer
0


కర్ణాటకలోని చామరాజనగర్ జిల్లా గుండ్లుపేట మార్గంలో రెండు రోజుల క్రితం ప్రియురాలిని పెట్రోల్ ట్యాంక్ పై కూర్చో పెట్టుకుని సినిమాస్టైల్లో కౌగిలింతలు, ముద్దులతో రోడ్డుపై రోమన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. పోలీసులు ఈ కేసును సుమోటాగా తీసుకుని బైక్ నెంబర్ ఆధారంగా దానియజమాని ఎస్.పి. స్వామిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్వామి మీద నిర్లక్ష్యపు డ్రైవింగ్, న్యూసెన్స్ కేసులు నమోదు చేశారు. కర్ణాటకలోని మైసూరు జిల్లాలోని హెచ్.డి.కోటే తాలూకాలోని శివపురలో నివసించే ఎస్.పి.స్వామి అనే యువకుడు అదే గ్రామానికి చెందిన యువతితో ప్రేమలో పడ్డాడు. ప్రేమికులిద్దరూ ప్రతిరోజూ బైక్ పై తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇద్దరిలో ఎవరికి ఏం ఆలోచన వచ్చిందో తెలియదు కానీ సినిమా స్టైల్లో రొమాన్స్ చేయాలనుకున్నారు. అంతే ఈనెల 21 న,సాయంత్రం 4 గంటల సమయంలో స్వామి తన ప్రియురాలిని బైక్ పై తనకు ఎదురుగా పెట్రోల్ ట్యాంక్ పై కూర్చోపెట్టుకుని రైడ్ చేశాడు. చామరాజనగర్ లోని గుండ్లుపేట వైపు వెళ్తున్న స్వామికి ప్రియురాలు అనుకోని గిఫ్ట్ ఇచ్చింది. ప్రియుడ్ని గట్టిగా కౌగిలించుకిని లిప్ కిస్ ఇచ్చింది. ఎదురుగా లారీలు బస్సులు వస్తున్నా వాళ్లు ఏమీ పట్టించుకోకుండా రయ్ రయ్ మని దూసుకుపోయారు. ఈ దృశ్యాలను ఎవరో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయటంతో వీరి గురించి అందరికీ తెలిసిపోయింది. ఈ వీడియోను సుమోటోగా తీసుకున్న మైసూరు, చామరాజనగర్ పోలీసులు బైక్ నెంబర్ ఆధారంగా స్వామిని అరెస్ట్ చేసి కేసు పెట్టారు.

Post a Comment

0Comments

Post a Comment (0)