ఢిల్లీ అల్లర్లకు మూలకారకుడు అమిత్ షా

Telugu Lo Computer
0


ఢిల్లీలోని జహంగీర్‌పూర్‌లో జరిగిన అల్లర్లకు ప్రధాన కారణం కేంద్ర హోం మంత్రి అమిత్ షా అని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఆరోపించారు. ఇటీవల ఢిల్లీలోని జహంగీర్‌పూర్‌లో హనుమాన్ జయంతి వేళ అల్లర్లు చోటుచేసుకున్నాయి. వీటిపై శరద్ పవార్ స్పందించారు. ఈ అల్లర్లను ఆపడంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆ అల్లర్లను నియంత్రించేవారని, కానీ, అక్కడి పోలీసులు కేంద్ర హోం శాఖా మంత్రి పరిధిలో ఉంటారని ఆయన చెప్పారు. ఆ శాఖను కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆధీనంలో ఉందన్నారు. అందుకే ఈ ఆల్లర్లకు పూర్తి బాధ్యుడు అమిత్ షా మాత్రమేనని చెప్పారు. ఢిల్లీలో ఏ చిన్నపాటి ఘటన జరిగినా అది యావత్ ప్రపంచానికి తెలిసిపోతుంది, చూస్తుందన్నారు. ఢిల్లీలో అశాంతి నెలకొందని తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలోని పరిస్థితులను నియంత్రలేకపోవడం ఆ ప్రభుత్వ చేతకాని తనానికి నిదర్శనమన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)