అటవీ శాఖ అధికారులపై బీజేపీ ఎమ్మెల్యే కుమారుల దాడి

Telugu Lo Computer
0


మధ్యప్రదేశ్‌లోని షియోపూర్‌లో అటవీ శాఖ అధికారులపై బీజేపీ ఎమ్మెల్యే ఇద్దరు కుమారులు దాడి చేశారు. దీంతో బాధిత అటవీ శాఖ అధికారుల ఫిర్యాదు మేరకు వారిపై కేసు నమోదు చేశారు. స్థానిక బీజేపీ ఎమ్మెల్యే సీతారాం ఆదివాసీకి చెందిన ఇద్దరు కుమారులు అడవి నుంచి కలప, ఇసుక, బండరాళ్లను అక్రమంగా రవాణా చేస్తున్నారు. తనిఖీ చేసిన ఇద్దరు అటవీ శాఖ అధికారులు దీనిపై బీజేపీ ఎమ్మెల్యే కుమారులను ప్రశ్నించారు. దీంతో అటవీ శాఖ అధికారులను వారిద్దరు తిట్టారు. అంతటితో ఆగక దాడి చేశారు. దీంతో బాధిత అటవీ శాఖ అధికారి రిషబ్ వర్మ దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యే సీతారాం ఆదివాసీ ఇద్దరు కుమారులపై పోలీసులు కేసు నమోదు చేశారు. తమకు అందిన ఫిర్యాదు ఆధారంగా బీజేపీ ఎమ్మెల్యే కుమారులపై 323, 294 తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు షియోపూర్‌ ఎస్‌డీవోపీ రామ్‌ తిలక్‌ మాల్వియా తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

Post a Comment

0Comments

Post a Comment (0)