పంజాబ్ వ్యాపారికి డియర్ వైశాఖీ బంపర్ లాటరీలో మెగా ప్రైజ్

Telugu Lo Computer
0


పంజాబులోని భటిండా జిల్లాకు చెందిన రోషన్ అనే వ్యాపారికి లాటరీ టిక్కెట్ కొనడం అలవాటు. దాదాపు 30 ఏళ్ల నుంచి టిక్కెట్లను కొంటూనే ఉన్నాడు. కొన్నిసార్లు వందో రెండొందలో తగిలేవి తప్ప చెప్పుకోదగ్గ అమౌంట్ రాలేదు. ఇన్నేళ్లుగా ఈ తతంగాన్ని గమనిస్తూ వచ్చిన అతని భార్య విసిగిపోయి ఇక నుంచి లాటరీ కొనడం మానేయమని ఒత్తిడి తెచ్చింది. వినకపోవడంతో కోపంతో ఊగిపోయింది. అయినా రోషన్  భార్యను కూడా కాదని లాటరీ టిక్కెట్ కొన్నాడు. ఈ క్రమంలో పంజాబ్ స్టేట్ డియర్ వైశాఖీ బంపర్ లాటరీలో మెగా ప్రైజ్ గెలుచుకున్నాడు. దీని విలువ రెండున్నర కోట్లు. ఈ విషయం తెలియగానే ఆనందంతో రాత్రంతా నిద్ర పట్టలేదని చెప్పాడు. పన్నులు పోను రూ. 1.75 కోట్లు వస్తాయని లెక్కలేసుకున్నాడు. వచ్చిన మొత్తాన్ని కుటుంబం, కొత్త వ్యాపారం కోసం ఖర్చు చేస్తానని తెలిపాడు. 

Post a Comment

0Comments

Post a Comment (0)