ముస్లిం వ్యాపారులపై ఆర్ఎస్ఎస్ దాడులు

Telugu Lo Computer
0


కర్ణాటకలోని ధర్వాద్‌ దగ్గర ముస్లిం వ్యాపారులకు చెందిన పండ్లు, కూరగాయల బళ్లను ఆర్ఎస్ఎస్ వారు ధ్వంసం చేశారు. నెగ్గికెరి అంజనేయస్వామి ఆలయ ప్రాంగణంలో శనివారం ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థయిన 'శ్రీరామ్‌ సేన' గ్రూపునకు చెందిన కొంత మంది దాడులకు పాల్పడ్డారు. వారు దాడులు చేస్తున్నాసమీపంలోనే ఉన్న పోలీసులు అడ్డుకోలేదు. కాషాయ దుస్తులు వేసుకున్న ఓ వ్యక్తి 'ముస్లిం వ్యాపారులకు అల్టిమేటం ఇచ్చాం' అంటూ ఏకంగా పోలీసుతోనే చెప్పినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఆలయ ప్రాంగణం నుంచి 15 రోజుల్లో ముస్లిం వ్యాపారులను వెళ్లగొట్టాలని దేవాలయ మేనేజ్‌మెంట్‌ను శ్రీరామ్‌ సేన హెచ్చరించింది. శనివారం నేరుగా దాడికి దిగింది. 15ఏళ్లుగా ఇక్కడ వ్యాపారం చేసుకుంటున్నామని.. ఈ విధంగా దాడులు చేస్తే ఎలా బతకాలని ముస్లిం వ్యాపారులు అవేదన వ్యక్తం చేశారు. హిందూ వ్యాపారుల దగ్గరే హిందువులు పళ్లు, కూరగాయలు కొనాలని హిందూ జనజాగృతి సమితి (బెంగళూరు) కోఆర్డినేటర్‌ చంద్రే మోగర్‌ ప్రకటించిన కొన్ని రోజుల వ్యవధిలోనే ఈ దాడి జరగింది. కర్ణాటకలో ఇప్పటికే హిజాబ్‌, హలాల్‌, అజాన్‌ పేరుతో ఇక్కడి బీజేపీ ప్రభుత్వం రోజుకో మతతత్వ అంశాన్ని అజెండాలోకి తీసుకొస్తోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)