యువకుడిని హత్య చేసిన యువతి

Telugu Lo Computer
0


అనంతపురంలోని ఆజాద్‌నగర్‌కు చెందిన వీరేష్‌ కుమార్‌ కూడేరు మండలం కమ్మూరు సమీపంలో ఓ ప్రైవేట్‌ వెంచర్‌లో సైట్‌ ఇంజినీరుగా పని చేస్తున్నాడు. అతడికి అనంతపురానికి చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉంది. వారిద్దరూ నెల నుంచి స్కంద కాలనీలోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. ఆదివారం రాత్రి చరవాణిలో అసభ్యకర చిత్రాలను తొలగించాలని మహిళ అతడిని కోరింది. ఈక్రమంలో ఇద్దరి మధ్య వాగ్వివాదం జరిగింది. ఆమెను బెదిరించడానికి యువకుడు చీరతో ఉరి వేసుకున్నాడు. మృతి చెందాడేమోనని చీరను మహిళ తొలగించింది. వెంటనే యువకుడు బెదిరించేందుకు మీదకు రాగా భయంతో ఆమె కూరగాయలు కోసే కత్తితో అడ్డుకోగా నుదుటి మీద తీవ్రగాయమై అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. అనంతరం వీరేష్‌ కుమార్‌ గొంతుకు చీర బిగించి హత్య చేసింది. ఉదయం స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, జాగిలంతో తనిఖీలు చేశారు. యువకుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని, నిందితురాలు పరారీలో ఉందని, ఆమె కోసం గాలిస్తున్నామని సీఐ వివరించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)