వ్యక్తిగత ఇష్టాలను గౌరవిస్తాం

Telugu Lo Computer
0

 

జేఎన్‌యూ వర్సిటీలో రెండు విద్యార్థి సంఘాల మధ్య జరిగిన ఘర్షణపై వైస్ ఛాన్సలర్ శాంతిశ్రీ దూళిపూడి పండిట్ స్పందించారు. జేఎన్‌యూ ఫ్రీ యూనివర్సిటీ అని, వ్యక్తిగత ఇష్టాలను గౌరవిస్తామని, అన్ని ఐడెంటిటీలకు ఇది మెల్టింగ్ పాయింట్ అని ఆమె అన్నారు. యువతకు భిన్నమైన అభిప్రాయాలు ఉంటాయని, భిన్నత్వాన్ని తాము ప్రోత్సహిస్తామని, కానీ హింసకు తావు ఇవ్వవద్దు అని వీసీ శాంతిశ్రీ తెలిపారు. శ్రీరామనవమి రోజున నాన్ వెజ్ మెనూ విషయంలో రెండు వర్గాల మధ్య గొడవ జరిగినట్లు తెలిసిందే. రెండు గ్రూపుల అభిప్రాయాలు విన్నట్లు వీసీ చెప్పారు. దాడి ఘటన పట్ల విచారణకు ఆదేశించామని, ఆ నివేదిక కోసం ఎదురుచూస్తున్నట్లు వీసీ శాంతిశ్రీ తెలిపారు. నిష్పక్షపాతంగా విచారణ జరుగుతున్నట్లు ఆమె చెప్పారు.

Post a Comment

0Comments

Post a Comment (0)