ఏప్రిల్ 14న రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మహారాష్ట్ర సోలాపూర్లో ఓ పెట్రోల్ బంక్ రూపాయికే పెట్రోల్ కార్యక్రమాన్ని చేపట్టారు. అయితే ఇందుకు కొన్ని షరతులు కూడా పెట్టారు. మొదట వచ్చిన 500 మందికి మాత్రమే రూపాయికే పెట్రోల్ పోస్తామని చెప్పారు. దీంతో ఆ ప్రాంతంలోని వారే కాకుండా ఎక్కడెక్కకడి నుంచో అక్కడ తరలివచ్చారు ప్రజలు. పెట్రోల్ బంకు ఎదుట పెద్ద ఎత్తున క్యూ కట్టారు. అంతకంతకూ రద్దీ పెరుగుతుండడంతో పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి పెట్టారు. పెను భారమైన పెట్రో ధరల్ని తగ్గించాలని సందేశం ఇచ్చేందుకే ఇలా చేశామని బంక్ యాజమన్యం చెబుతోంది.
రూపాయికే లీటర్ పెట్రోల్ !
April 15, 2022
0
Tags