50 మంది యువతులతో ప్రేమాయణం ?

Telugu Lo Computer
0


రెండు నెలల క్రితం జైపూర్‌లో ఓ యువతి హత్యకు గురైంది. ఆ కేసును సవాల్‌గా స్వీకరించిన పోలీసులు నిందితుడి కోసం తీవ్రంగా గాలించారు. అయినా దొరకకపోవడంతో ఓ ఇన్ ఫార్మర్ సహాయంతో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు మింటూ అని, అతడో సైకో అని, అతడు సెక్స్‌కు అడిక్టయ్యాడని పోలీసులు పేర్కొన్నారు. ఈ కేసులో సైకాలజిస్ట్ సహాయం కూడా తీసుకుంటున్నట్లు తెలిపారు. అతడిపై పలు చోట్ల కేసులు ఉన్నట్లు గుర్తించినట్లు పోలీసులు చెప్పారు. శృంగారానికి ఒప్పుకోని వాళ్లపై అత్యాచారానికి పాల్పడి, ఆ తర్వాత వారిని హత్య చేసి ఆత్మహత్యలుగా చిత్రీకరించినట్లు పోలీసులతో చెప్పాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)