పుదుచ్చేరి ఇన్ఛార్జి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై ఏర్పాటు చేసిన విందు కార్యక్రమానికి ప్రతిపక్షాల ప్రతినిధులు గైర్హాజరయ్యారు. తమిళ సంవత్సరాది సందర్భంగా లెఫ్టినెంట్ గవర్నర్ అధికార నివాసమైన రాజ్నివాస్లో శనివారం 'చిత్తిరై నిలవు' పేరిట తేనీటి విందు కార్యక్రమం జరిగింది. ఇందులో ముఖ్యమంత్రి రంగస్వామి, మంత్రులు, అన్నాడీఎంకే, భాజపా ప్రతినిధులు పాల్గొన్నారు. డీఎంకే, కాంగ్రెస్ పార్టీల ప్రతినిధులు గైర్హాజరయ్యారు. అధికార పరిధి దాటి ఇన్ఛార్జి లెఫ్టినెంట్ గవర్నర్ వ్యవహరిస్తున్నారని, పుదుచ్చేరికి కేంద్రం నుంచి నిధులు కోరడం లేదని, పూర్తిస్థాయి లెఫ్టినెంట్ గవర్నర్ను నియమించాలనే డిమాండ్లతో ఈ కార్యక్రమాన్ని బహిష్కరించినట్లు ప్రతిపక్షాలు తెలిపాయి.
తమిళిసై విందుకు ప్రతిపక్షాల గైర్హాజరు
April 17, 2022
0
Tags