బ్రిటన్, చైనాలో పెరుగుతోన్న కరోనా కేసులు

Telugu Lo Computer
0


బ్రిటన్ లో కరోనా ఇన్ఫెక్షన్ కేసులు తారాస్థాయికి చేరాయి. దాంతో హాస్పటల్స్ లో చేరే వారి సంఖ్య పెరగడంతో పాటు మరణాల రేటు కూడా మరోసారి అధికంగా నమోదవుతోంది. ఎక్కువగా బీఏ.2 రకానివే ఉంటున్నాయి. మార్చి 26తో ముగిసిన వారంలో 49 లక్షల కేసులు వెలుగు చూశాయి. మరోవైపు చైనాలో  సైతం కరోనాతో ఎక్కువగా ఇబ్బంది పడుతోంది. అక్కడి అధికార యంత్రాంగం కఠిన ఆంక్షలను అమలు చేస్తోంది. ఆదివారం 13,146 కేసులు నమోదయ్యాయి. మొదటి విడతలో కరోనా కేసుల గరిష్ట స్థాయితో చూసినా ఇప్పుడు నమోదవుతున్న కేసులే ఎక్కువగా ఉంటున్నాయి. కొత్త కేసుల్లో 70 శాతం షాంఘై నుంచే వస్తున్నాయి. జీరో కోవిడ్ పాలసీలో భాగంగా 2.7 కోట్ల ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. దక్షిణ కొరియాలో శనివారం 2,64,171 కొత్త కేసులు వెలుగు చూశాయి. దేశవ్యాప్తంగా ఉన్న 74 లక్షల మందిని కరోనా పరీక్ష చేయించుకోవాలని అక్కడి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

Post a Comment

0Comments

Post a Comment (0)