ఆంధ్రప్రదేశ్ లో రేపటి నుంచి ఒంటిపూట బడులు

Telugu Lo Computer
0


ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్న కారణంగా ఏప్రిల్ 4 నుంచి ఒంటి పూట బడుల నిర్వహణకు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ  ఉత్తర్వులు జారీ చేసింది. విద్యార్థుల ఆరోగ్యం, భద్రత దృష్ట్యా ఒకటి నుంచి తొమ్మిదో తరగతులకు ఒంటి పూట బడులు నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. ఉదయం 07.30 నుంచి 11.30 వరకు తరగతులను నిర్వహించనున్నట్లు తెలిపింది. ఆ తర్వాత మధ్యాహ్న భోజనం పెట్టి విద్యార్థులను ఇంటికి పంపించనున్నారు. ఇప్పటికే తెలంగాణలో ఉదయం 11.30 వరకే పాఠశాలలు నిర్వహిస్తున్నారు.  ఏప్రిల్ 27 నుంచి పదో పరీక్షలు జరగనున్న కారణంగా వారికి తరగతులు యథావిధిగా జరగనున్నాయి. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ప్రాంతీయ జాయింట్ డైరెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు జిల్లా విద్యాశాఖాధికారులు తగు చర్యలు తీసుకోవాలని సూచించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)